Wednesday, May 8, 2024

భారత్‌ @11 లక్షలు.. 24 గంటల్లో 40వేలకుపైగా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

India seen record 40425 new corona cases in 24hrs

న్యూఢిల్లీః భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. దీంతో ప్రతిరోజూ దాదాపు 40వేల కరోనా కేసులు నమోదవుతుండడంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 11 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 40,425 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనాతో మరో 681మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 11,18,043కు చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటివరకు 27,497 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రసుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 3,90,459మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 7లక్షల 87 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

India seen record 40425 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News