- Advertisement -
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ కెపి వివేకానంద గౌడ్కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన టెస్టు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబంతో సహా ఎంఎల్ఎ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగినవారికి కూడా అధికారులు టెస్టులు చేయనున్నారు. కాగా, తెలంగాణలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
Quthbullapur MLA Vivekananda tests positive for Corona
- Advertisement -