అల్లు అర్జున్ , సుకుమార్ కలయికలో ‘పుష్ప’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించారట. కాగా కరోనా మూలంగా గ్యాప్ వచ్చినా కూడా బడ్జెట్లో ఎటువంటి మార్పు లేదట. ఇక ఆగస్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి సాధ్యమైనంత తక్కువమందితో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్లో అల్లు అర్జున్,- రష్మికపై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే సాంగ్కి ఎక్కువ మంది డ్యాన్సర్స్ కావాల్సి ఉండడం, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడంతో పాటలను ఇప్పుడే వద్దనుకుంటున్నారట. ముందుగా సాంగ్స్ కంటే కూడా తక్కువమంది ఆర్టిస్ట్లు ఉన్న సీన్స్నే షూట్ చేయాలనుకుంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
ముందుగా తక్కువమందితోనే సీన్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -