Sunday, April 28, 2024

టి-20 సిరీస్ భారత్‌దే

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ(63) అద్భుత ప్రదర్శనతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ మూడు వికెట్లను తీసి కంగారుల నడ్డి విరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 19.5 ఓవర్లలో లక్షాన్ని ఛేదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. బౌలర్ అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.

అర్ధ సెంచరీలతో అదరగొట్టిన
సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ
ఆసీస్‌పై 6వికెట్ల తేడాతో విజయం
2-1తేడాతో సిరీస్ రోహిత్ సేన కైవసం
టీమిండియాకు సిఎం కెసిఆర్ అభినందనలు

 

 

హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ ముంగిట కంగారూలకు టీమిండియా షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగ ంగా ఆదివారం జరిగిన మూడో టీ20లో భార త్ అదరగొట్టింది. హైదరాబాద్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక ఆస్ట్రేలియాపై 6వికెట్ల తేడాతో అదుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ను నిర్దేశించిన లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. సూర్య, కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్‌తో కంగారూలను హడలెత్తించారు. 69పరుగులు, కోహ్లీ 63 పరుగులు చేసి హాఫ్‌సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఓ బంతి మిగిలి ఉండగానే నిర్దేశించిన విజయలక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లు టేగీన్, టిమ్ డేవిడ్ అర్ధశతకాలు సాధించినా ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. జరిగిన తొలి ఆస్ట్రేలియా తేడాతో గెలుచుకుంది. అనంతరం నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20ను భారత్ తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసుకుంది. జరిగిన నిర్ణయాత్మక టీ20లో గెలిచిన రోహిత్‌సేన తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఆసీస్‌కు అక్షర్ షాక్
తొలుత టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. రిషభ్‌పంత్ స్థానంలో భువనేశ్వర్ తిరిగి జట్టులో చేరాడు. కంగారూల ఇన్నింగ్స్‌ను టేగీన్, ప్రారంభించగా భారత ఎటాక్‌ను భువీ ఆరంభించి తొలి ఓవర్లోనే ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్‌పటేల్ బౌలింగ్‌కు దిగి రెండు బౌండరీలతో సహా జోరుగా ఆడుతున్న బుమ్రా సైతం అడ్డుకట్ట వేయలేక తొలి ఓవర్లోనే ండు సిక్సర్లు, ఓ కలిపి ఈక్రమంలో అక్షర్ కంగారూలకు షాక్ ఇచ్చాడు. బౌలింగ్‌లో బంతిని బౌండరీకి పంపిన (7) రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్మిత్ క్రీజులోకి రాగా దూకుడుగా ఆడుతున్న టేగీన్ ఇదే ఓవర్లో చివరి మూడు బంతులను బౌండరీ లైనుకుపంపి హ్యాట్రిక్ ఫోర్లు నమోదు చేశాడు. ఈ ఓవర్లో 16పరుగులు ఆసీస్ చేరాయి. స్కోరు హాఫ్‌సెంచరీ మార్కుదాటి చేరింది. అయితే మరుసటి ఓవర్లోనే టేగీన్‌కు భువీ చెక్ చెప్పాడు. సిక్సర్లతో పరుగులు సాధించి హాఫ్ సెంచరీ చేసిన గ్రీన్ భువీ బౌలింగ్‌లో రాహుల్ చేతికి దొరికిపోయాడు. వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌పడింది. ప్లే ముగిసేసరికి నష్టానికి పరుగులు చేసింది. ఇద్దరూ వెనుదిరగడంతో ఆస్ట్రేలియా జోరుకు కళ్లెం పడింది. 117 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికె ట్ కోల్పోయింది. స్లాగ్ ఓవర్స్‌లో టిమ్ డేవిడ్ ధాటిగా స్కోరు పుంజుకుంది. బంతుల్లో 54 పరుగులు చేసి హాఫ్‌సెంచరీ నమోదుచేసి బౌలింగ్‌లో రోహిత్ చేతికి చిక్కాడు. మొత్తంమీద ఓవర్లలో నష్టానికి పరుగులు చేసింది. బౌలర్లలో మూడు వికెట్లు తీయగా, హర్షల్ తలో వికెట్ పడగొట్టారు.
ఆదుకున్న కోహ్లీ, సూర్య
ఆస్ట్రేలియా నిర్దేశించిన 187పరుగుల లక్షఛేదనలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ (1)తొలి సామ్స్ బౌలింగ్‌లో చేతికి క్యాచ్ ఇచ్చి 5పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం నాలుగో ఓవర్లో హిట్‌మ్యాన్‌కు షాక్ ఇచ్చాడు. ఓ సిక్స్‌తో చేసిన కెప్టెన్ రోహిత్‌శర్మ కమిన్స్ బౌలింగ్‌లో డానియల్ సామ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వద్ద భారత్ రెండో కీలక వికెట్ పడింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి చేసింది. కోహ్లీ, సూర్య సమన్వయంతో ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 10 ఓవర్లకు భారతజట్టు నమోదు చేసింది. 19ఓవర్లకు 176/3 స్కోరు చేయడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. చివరి ఓవర్ వేసేందుకు డానియల్ సామ్స్‌రాగా తొలి బంతికి కోహ్లీ సిక్సర్ కొట్టాడు. రెండో బంతికి యత్నంచి ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న ఫించ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. 3బంతుల్లో నాలుగు పరుగులు అవసరమవగా హార్దిక్ ఐదోబంతిని ఫోర్ కొట్టాడు. దీంతో ఓ బంతి మిగిలి ఉండగానే భారత్ 187పరుగులతో లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 69 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సిరీస్ ఎనిమిది వికెట్లు తీసిన అక్షర పటేల్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కెమెరూన్ గ్రీన్ కు దక్కింది.

సిఎం కెసిఆర్ అభినందనలు

ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీం ఇండియాకు సిఎం కెసిఆర్ అభినందనలు తెలి పారు. హైదరాబాద్‌లో సిరీస్ కైవసం చేసుకోవ డంపై హర్షం వ్యక్తం చేశారు. మ్యాచ్ రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన క్రీడాశాఖ మంత్రి, పోలీస్ అధికారులు, సిబ్బందిని సిఎం కెసిఆర్ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News