Friday, May 3, 2024

నెదర్లాండ్‌పై భారత్ గెలుపు

- Advertisement -
- Advertisement -

 

ఆస్ట్రేలియా: సిడ్నీ స్టేడియంలో ప్రపంచ కప్‌లో భాగంగా నెదర్లాండ్‌పై భారత జట్టు గెలుపొందింది. భారత జట్టు 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నెదర్లాండ్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నెదర్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్లలో టిమ్ ప్రింగ్లీ(20), మ్యాక్ దోవ్డ్(16), బాస్ డీ లీడీ(16), కోలిన్ అక్కర్‌మాన్(17), షారిజ్ అహ్మద్(16 నాటౌట్),పాల్ వ్యాన్ మీకిరెన్(14 నాటౌట్) ,టామ్ కూపర్(09), స్కాట్ ఎడ్వర్డ్(05), లోగాన్ వ్యాన్ బీక్(03), విక్రమ్ జీత్ సింగ్(01) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, రవీచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీయగా మహ్మాద్ షమీ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News