Sunday, May 5, 2024

రెండో టెస్టులో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

India won second Test against England by 317 runs

చెన్నై: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ అద్భత విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 317 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. చెన్నైలోనే జరిగిన మొదటి టెస్టు ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. రెండో టెస్టులో రోహిత్ శర్మ, అశ్విన్ సెంచరీలతో చెలరేగారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అశ్విన్ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో( 5), రెండో ఇన్నింగ్స్ లో (3) వికట్లను అశ్విన్ తీసి ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు. టెస్టు అరంగేట్రంలోనే స్పిన్నర్ అక్షర్ పటేల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో (2), రెండో ఇన్నింగ్స్ లో (5) వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో కుల్ దీప్ యాదవ్ కు (2) వికెట్లు దక్కాయి.  తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 286 రాబట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్టులో అశ్విన్ ఎనిమిది వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

India won second Test against England by 317 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News