- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సేనా భవన్లోని ఆర్మీ హెడ్క్వార్టర్స్ కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఓ ఆర్మీ జవాన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతోపాటు మరో జవానుకు కరోనా సోకినట్లు అనుమానిత కేసు నమోదైంది. దీంతో బిల్డింగ్ లో ఫ్యుమిగేషన్, శానిటేషన్ చేసేందుకు అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు. దేశంలో ఇప్పటికే చాలామంది సైనికులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారిని క్వారంటైన్లకు తరలించారు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య మొత్తం 81,970కు చేరింది. గత 24 గంటల్లో 3,967 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మొత్తం 2,649 మంది మృతిచెందారు.
Indian Army HQ Building of Sena Bhawan Closed in Delhi
- Advertisement -