Tuesday, April 30, 2024

ప్రమాదవశాత్తు జరిగిన క్షిపణి ఘటన : అమెరికా వెల్లడి

- Advertisement -
- Advertisement -

Indian missile that crashed on Pakistani soil was accidental

 

వాషింగ్టన్ : పాకిస్థాన్ భూభాగంలో కూలిన భారత్ క్షిపణి ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేతప్ప మరో కోణం కనిపించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ సోమవారం విలేఖరులతో అన్నారు. దీనిపై ఇప్పటికే మార్చి 9 న భారత్ విలువైన వివరణ ఇచ్చిందని , ఇంతకంటే ఎక్కువగా దీనిపై తాము స్పందించలేమని వివరించారు. మార్చి 9న భారత వాయుసేన స్థావరంలో ఓ క్షిపణికి సాధారణ తనిఖీలు చేస్తుండగా, సాంకేతిక లోపం తలెత్తి అది గాల్లోకి లేచింది. ప్రమాదవశాత్తు దూసుకెళ్లి పాక్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత రక్షణశాఖ వివరణ ఇచ్చింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News