Tuesday, April 30, 2024

ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిసిఎల్‌ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బా ధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందు కు అప్పగించారని సిఎం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కం పెనీల చేతుల్లో ఉన్నాయని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు.అత్యంతగో ప్యం గా ఉండాల్సిన భూముల డేటా ను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాల న్నీ ఏజెన్సీ దగ్గర ఉంచడాన్ని ముఖ్యమం త్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా, సురక్షితంగా ఉన్నట్టా, లేనట్టా అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. శనివా రం సచివాలయంలో ధరణి కమిటీతో సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమం త్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటై ర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి. మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవె న్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మి ట్టల్, ము ఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సిఎంఆర్‌ఓ వి.లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 2018లో టెక్నికల్, ఫె నాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆ ధారం గా ఐఎల్ ఎఫ్‌ఎస్ అనే కంపెనీకి అ ప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్‌మెంట్‌ను అప్పగించిందని అధికారులు సిఎంకు ఈ సందర్భంగా వివరించారు. ఆ కంపెనీ దివాళా తీసింద ని,తర్వాత టెర్రాసిస్ అని పేరు మా రటం, డైరెక్టర్లు అందరూ మారిపోవ టం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫా ల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతు లు మారటంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిడ్ దక్కించుకు న్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పే ర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
రూ.116 కోట్లకు టెండర్…రూ.1200 కోట్లకు విక్రయం
2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సిఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున విలువైన భూములపై పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ఆయన ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా అని సిఎం రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.
ధరణిలో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు
ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి, విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సిఎం అధికారులకు సూచించారు.
ధరణిని సవరించాలంటే కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం చేయాలి
2020లో అమల్లోకి వచ్చిన ఆర్‌ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల నవీకరణతోనే కొత్త చిక్కులు వచ్చాయని, ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని ధరణి సభ్యులు సిఎంతో పేర్కొన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వారు వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ, ఏయే మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలన్న అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ధరణి కమిటీ సిఎం దృష్టికి తీసుకెళ్లింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని వారు సిఎం రేవంత్‌తో తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ, విక్రయాలు కూడా జరుగుతున్నాయన్న చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం చేయడం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.
కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా చర్యలు
కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే చట్ట సవరణ చేయటం లేదా కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని సిఎం రేవంత్ చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సిఎం రేవంత్ సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సిఎం అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీకి ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సిఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడున్న పెండింగ్ దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News