- Advertisement -
హైదరాబాద్ : మేడారం జాతరకు టిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు, రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాల శాఖ మంత్రి కె.తారకరామారావుకు బుధవారం రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం జాతర చారిత్రాత్మక వైభం పూర్వ పరాలను, జాతర సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. ఈ జాతరల్లో జరుగుతున్న పనుల తీరు తెన్నులను కెటిఆర్కు సమగ్రంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహబుబాబాద్ ఎంపి మాలొత్తు కవిత, శాసన మండలి సభ్యులు పి.శ్రీనివాస్ రెడ్డి తదితులు పాల్గొన్నారు.
Invitation to KTR for Medaram jatara
- Advertisement -