దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు జరుగుతున్న మ్యాచ్ లో ముంబై భారీ స్కోరు సాధించింది. దీంతో ముంబై జట్టు పంజాబ్ కు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్ బౌలర్లు లైన్ అండ్ లెగ్త్ బంతులతో ముంబై బ్యాట్స్ మెన్లను కట్టడి చేశారు. దీంతో ముంబై స్కోరు బోర్డు నత్తనడకన సాగింది.ఈ దశలో ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడు పెంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో రోహిత్ 45 బంతుల్లో 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పొలార్డ్(40)తో జతకలిసిన హర్దిక్ పాండ్యా(30) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇద్దరూ పోటాపోటిన ఫోర్లు, సిక్సులతో చెలరేగడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది.
IPL 2020: MI Setup 192 Runs Taget to KXIP