Tuesday, May 7, 2024

ఐపిఎల్ 2020: ముంబైపై బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

షార్జా: ఐపిఎల్‌ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌తో తలపడుతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ జట్టుకు అత్యంత కీలకం. ఇందులో ముంబైపై గెలిస్తేనే హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్‌ చేరుతుంది. ఓడితే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. దీంతో హైదరాబాద్ జట్టు ముంబైని ఓడించి ప్లేఆఫ్ కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ మ్యాచ్ లో ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్‌ పేర్కొన్నాడు.

IPL 2020: SRH Win Toss and Opt Bowl against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News