Friday, May 3, 2024

చెలరేగిన డుప్లెసిస్‌.. కోల్‌కతా లక్ష్యం 221

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపీఎల్‌ 2021లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో చెన్నై, కోల్‌కతాకు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి ఓపెనర్లు డుప్లెసిస్‌(95 నాటౌట్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌(64)లు వంద పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది.వీరితోపాటు చివర్లలో మొయిన్‌ అలీ(25), మహేంద్ర సింగ్‌ ధోనీ(17)లు బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి, నరైన్, రస్సెల్ లు తలో వికెట్ తీశారు.

IPL 2021: CSK set target 221 runs against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News