Tuesday, April 30, 2024

అవగాహన లేమిని కప్పిపుచ్చుకునేందుకే

- Advertisement -
- Advertisement -

Prashant Kishor Criticizes PM Modi

కరోనా సంక్షోభాన్ని పట్టించుకోని మోడీ
ప్రశాంత్ కిషోర్ విమర్శలు

కోల్‌కత: తన అవగాహన లేమి, దూరదృష్టి లేమిని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ కొవిడ్-19 సంక్షోభాన్ని పట్టించుకోవడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న కిషోర్ కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించామంటూ ప్రధాని మోడీ ప్రజలను వంచించారని ఆయన మంగళవారం ఒక ట్వీట్‌లో ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఇతరులపై నింద తోసెయ్యడం, పరిస్థితి మెరుగుపడితే ఘనతను తన భక్త సైన్యం ఖాతాలో వేయడం మోడీ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకమని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News