Saturday, May 18, 2024

వార్నర్ దూకుడు.. విజయం దిశగా సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ 2021లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్, మనీష్ పాండే నిలకడగా ఆడుతున్నారు. వార్నర్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ‌ దూకుడు చూపిస్తున్నాడు. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా(1) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి వార్నర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నాడు. దీంతో సన్‌రైజర్స్ స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్‌(48), మనీస్ పాండే(32)లు ఉన్నారు.

IPL 2021: SRH Score 89 in 12 Overs against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News