Saturday, April 27, 2024

IPL 2023: శివమ్, రహానె విధ్వంసం.. కోల్ కతా లక్ష్యం 236

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ఐపిఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్లు శివమ్ దూబె(50), అజింక్యా రహానె(71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫోర్లు, సిక్సులతో బౌండరీల మోత మోగించారు.

వీరితోపాటు ఓపెనర్ కాన్వే(56) రాణించగా, చివర్లో రవింద్ర జడేజా(18) ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో చెన్నై, కోల్ కతాకు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News