Wednesday, May 15, 2024

IPL 2023: 205 పరుగుల లక్ష్యం… ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన కోల్ కతా..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. గుజరాత్ విధించిన 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్(47), నితిష్ రాణా(30)లు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నారు. దీంతో కోల్ కతా 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News