Tuesday, April 30, 2024

వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

IPL Cricket Betting Gang Arrested in Vanasthalipuram

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను శనివారం ఎల్బీనగర్ ఎస్ వోటీ పోలీసులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షలు, బెట్టింగ్ కోసం ఖాతాల్లో ఉన్న రూ.90లక్షలు సీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడు చక్రిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు చక్రి గోవా, బెంగళూరులోనూ భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించినట్టు విచారణలో తెలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపిఎల్ ప్రారంభం కావడంతో నగరంలో భారీగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News