Tuesday, April 30, 2024

నేడే ఐపిఎల్ తుది షెడ్యూల్ విడుదల…

- Advertisement -
- Advertisement -

 IPL final schedule released

 

ముంబై : ఐపిఎల్‌కు సంబంధించి తుది షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేస్తామని ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శనివారం ప్రకటించారు. సెప్టెంబర్ 19 నుంచి యుఎఇ వేదికగా ఐపిఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంత వరకు విడుదల కాలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముంబై ఇండియన్స్‌చెన్నై జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో చైర్మన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టోర్నీలో 8 ఫ్రాంచైజీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇక ఇప్పటికే అన్ని జట్ల క్రికెటర్లు సాధనలో నిమగ్నమయ్యారు. చెన్నై క్రికెటర్లు కూడా సాధనను ఆరంభించారు. కాగా, టోర్నీ గడువు సమీపిస్తున్నా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాక పోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా చైర్మన్ చేసిన ప్రకటనతో ఇలాంటి ఊహాగానాలకు తెరపడింది.

కోల్‌కతాబెంగళూర్ మధ్య తొలి మ్యాచ్?

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ టోర్నమెంట్‌లో ఆరంభ మ్యాచ్‌కు సంబంధించి ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. తొలి మ్యాచ్‌లో ఆడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం సృష్టించింది. దీంతో చెన్నై ఆటగాళ్లు చాలా ఆలస్యంగా సాధనను ఆరంభించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో చెన్నై ఆరంభ మ్యాచ్‌కు సిద్ధంగా ఉందా లేదా అనే దానిపై సందేహం నెలకొంది. మరోవైపు తాజాగా ఐపిఎల్ ట్విటర్‌లో పెట్టిన ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారధి విరాట్ కోహ్లి ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్టర్ ఐపిఎల్ షెడ్యూల్ ఆరంభ మ్యాచ్‌కు సంబంధించినదిగా స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News