హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ(82) శనివారం సాయంత్రం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుడిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. జానీ బక్షీ శ్వాస సమస్య వ్యాధితో కొని రోజులుగా బాధపడుతున్నారు. సెప్టెంబర్ 5న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జుహూలోని ఆరోగ్య నిది ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మృతిపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దర్శకుడిగా, నిర్మాతగా జానీ ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఇందులో రాజేశ్ ఖన్నా కథానాయకుడిగా నటించిన ‘ఖుదాయి’తో పాటు ‘డాకు ఔర్ పోలీస్’ చిత్రానికి జానీ బక్షీ దర్శకత్వం వహించారు. మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25 బాలీవుడ్ ప్రముఖులు మృతి చెందారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్, సరోజ్ ఖాన్, రాజన్ సెహగల్ తదితరులు తుదిశ్వాస విడిచారు.