- Advertisement -
హైదరాబాద్: మరో అవినీతి చేేప ఎసిబి అధికారుల వలకు చిక్కింది. నగరంలోని ఘట్ కేసర్ మండలం ఇస్మాయిల్ ఖాన్ గూడ పురపాలక బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న కుమార స్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. బాల్ రాజ్ గౌడ్ అనే వ్యక్తి నుంచి కుమర స్వామి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాల్ రాజ్ నేరుగా ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బాల్ రాజ్ నుంచి బిల్ కలెక్టర్ కుమార స్వామి పది వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
Ismailkhanguda Municipality Bill Collector in ACB Net
- Advertisement -