Sunday, April 28, 2024

సాగర్ నియోజకవర్గానికి జానా చేసిందేమీ లేదు: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadeesh Reddy comments on Janareddy in Nagarjunasagar

 

నల్గొండ: ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ వేసిన సందర్భంగా జగదీశ్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున పక్కనే ఉన్న తాగు, సాగునీటికి ఈ ప్రాంతం నోచుకోలేదని మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జానా రెడ్డి తన రాజకీయ జీవితంలో సాగర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగంలో సిఎం కెసిఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకరావడంతో వ్యవసాయం పండగలా మారిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News