Wednesday, May 15, 2024

కర్నాటకలో జీపు- లారీ ఢీ: ఎనిమిది మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Jeep-Lorry collision: Eight killed in Karnataka

బెంగళూరు : కర్నాటకలో ఆదివారం జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు దుర్మరణం చెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చికబల్లపూర్ జిల్లాలోని చింతామణి తాలూకాలో జరిగింది. ప్రయాణికులతో వెళ్లుతున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంట్ లారీ ఢీకొందని, దీనితో జీపులోని వారిలో 8 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రయాణికులలో కొందరికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News