Sunday, April 28, 2024

రేపటి నుంచే జైపూర్, జోధ్‌పూర్,ఉదయపూర్‌లలో జియో 5జి సేవలు ప్రారంభం!

- Advertisement -
- Advertisement -

జైపూర్: రేపటి నుంచే రిలయన్స్ జియో వినియోగదారులు రాజస్థాన్‌లోని మూడు నగరాల్లో  5జి సేవలను పొందనున్నారు. జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్‌లలో జియో 5జి ని ప్రారంభించబోతోంది. ఈ సర్వీసును ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రారంభించనున్నారు. రిలయన్స్ ఇటీవల రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా నుండి 5జి సేవలను ప్రారంభించింది. అదే సమయంలో, కంపెనీ 2023 నుండి రాజస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్ మూడు నగరాల్లో జియో ట్రూ 5జి సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ అధికారులు తెలిపారు. ఆవిష్కరణ వేడుక భామాషా టెక్నో హబ్ (స్టేట్ డేటా సెంటర్)లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News