Wednesday, May 1, 2024

దాహం తీర్చిన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Mission Bhagiratha

 

దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్‌జీవన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంస

హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే సాధించిందని జల్ జీవన్ మిషన్ టాస్క్ ఫోర్స్ ప్రశంసించింది. మిషన్ భగీరథ తో నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని సంబంధిత అధికారులను అభినందించింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యులు జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా 17 తారీఖు నుంచి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ది కేంద్రాలు, ఇంటెక్ వెల్స్ తో పాటు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా భగీరథ నీటిని ఉపయోగిస్తున్న ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది.

సోమవారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఇఎన్‌సి కృపాకర్ రెడ్డితో సమావేశం అయింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్ ఫోర్స్ కు భగీరథ అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భగీరథ ప్రాజెక్టు ఫోటోలు, తాగునీరు సరాఫరా అవుతున్న ఆవాసాల్లోని ప్రస్తుత స్థితిని తెలియచేశారు.

ఈ సందర్భంగా గుజరాత్ వాస్మో ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ ఆర్.కె. సుమ మాట్లాడుతూ, ప్రజలందరికి సురక్షిత తాగునీరు అందించడమన్నది అంత సులువైన విషయం కాదన్నారు. 70 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో ఇప్పటిదాకా అది సాధ్యం కాలేదన్నారు. 2024 నాటికి ఇంటింటికి నల్లాతో తాగునీటిని అందిస్తామని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటున్నది. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ దీన్ని ఎప్పుడో సాధించింది. ఇది గర్వించాల్సిన విషయమన్నారు. మిషన్ భగీరథతో ఇంటి ముందుకే సురక్షిత తాగునీటిని సరాఫరా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత భగీరథ అధికారుల మీదనే ఉందన్నారు. కమ్యూనిటీ భాగస్వామ్యంతో మరింత సమర్థవంతమైన తాగునీటి సరాఫరా వ్యవస్థను రూపొందించవచ్చు అన్నారు. తాగునీరు ఎంతో పవిత్రమైనదని దాన్ని వృథా చేయవద్దని ప్రజలను కోరారు.

అనంతరం వాష్ స్పెషలిస్ట్ అవినాష్ జుస్తి మాట్లాడుతూ, నల్లగొండ ఫ్లోరైడ్ గ్రామాల్లో పర్యటించినం. మిషన్ భగీరథ నీటిని ఉపయోగించిన 15 రోజుల్లోనే స్పష్టమైన మార్పు కనిపించిందని బాధితులు చెప్పారు. సొంతంగా నిలబడడం, నడవడం చేస్తున్నామని చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు.

ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ మోడల్ రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారుతుందన్నారు. ఒక తాగునీటి పథకం కోసం బ్యాంకుల నుంచి రుణాలు సేకరించాలన్న ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ఇది దేశంలోనే తొలిసారని కితాబిచ్చారు. ఇక మిషన్ భగీరథ ప్రాజెక్టుకోసం వేసిన సరాఫరా వ్యవస్థ నాణ్యత అత్యుత్తమంగా ఉందని అవినాష్ ప్రశంసించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో తాము ఈ విషయాన్ని గమనించామన్నారు. ప్రజలు కూడా భగీరథ నీటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

చివరగా పబ్లిక్ హెల్త్ విభాగం మాజీ చీఫ్ ఇంజనీర్ మోహన్ మాట్లాడుతూ, ఇన్నేళ్ల తరువాత నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంజనీర్లు చేసిన మేలును అక్కడి ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని చెప్పారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు విజయ్ పాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చక్రవర్తి, శ్రీనివాస్ రావు, కన్సల్టెంట్లు నర్సింగరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Justice for victims of fluoride with Mission Bhagiratha
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News