Friday, May 10, 2024

కనుల నీరు రాలదే…

- Advertisement -
- Advertisement -

‘గాలోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే..’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ… “సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాం. తప్పకుండా ఈ పాట, సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం” అని అన్నారు. డైరెక్టర్ అరుణ్ విక్కీరాల మాట్లాడుతూ.. “కాలింగ్ సహస్త్ర సినిమా తర్వాత సుధీర్ రేంజ్ నెక్స్ రేంజ్‌కు చేరుతుంది. ఈ సినిమాకు మోహిత్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు”అని తెలిపారు. హీరో సుధీర్ మాట్లాడుతూ.. “మోహిత్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే జిత్తు మాస్టర్ సాంగ్‌కు చక్కగా కొరియోగ్రఫీ చేశారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, డాలీషా, విజేష్ తయాల్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News