Monday, April 29, 2024

ఫిబ్రవరి 1న ఎంఎల్‌ఎగా కెసిఆర్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెగా బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎంఎల్‌ఎగా కెసిఆర్ ప్రమా ణం చేయనున్నారు. నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫ లితాలు డిసెంబర్‌లో ప్రకటించగా అదే నెల 9న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి ప్రమాణస్వీకారం చేయించా రు. అంతకు ముందురోజు అర్ధరాత్రి కెసిఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిపోగా తుంటికి గాయమైంది. ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఊతకర్ర సహాయంతో నడుస్తున్నారు. గజ్వేల్‌లో కెసిఆర్ వరుస గా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో ఆయన కు 1,11,684 ఓట్లు పోలయ్యాయి. బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై 45 వేలకుపైగా మెజారిటీతో కెసిఆర్ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నుంచి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News