Saturday, May 11, 2024

వెంటనే సైన్యాన్ని రప్పించండి

- Advertisement -
- Advertisement -

delhi-violence

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని రెండు ప్రాంతాలలో తాజాగా మరోసారి హింసాకాండ చెలరేగిన దరిమిలా ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారని కేజ్రీవాల్ అన్నారు. వెంటనే సైన్యాన్ని రప్పించి అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలలో కర్ఫూ విధించాలని ఆప్ అధినేత బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా రాస్తానని ఆయన చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలలో ఇప్పటివరకు 20 మంది మరణించారు.

Kejriwal asks HM to call in Army, Arvind Kejriwal says that Army should be brought to control the situation in East Delhi where riots are continued

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News