- Advertisement -
తిరువనంతపురం : కేరళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ తమ పదవికి రాజీనామా చేశారు. కుమారులు బినీష్, బినయ్ల వల్ల తలెత్తిన వివాదాల నడుమ ఆయన శుక్రవారం బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలకు తెలిపారు. అయితే తన అనారోగ్య సమస్యతో చాలా కాలంగా చికిత్స పొందుతున్నందున బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిని పార్టీ నాయకత్వం ఆమోదించింది. అయితే పదవి నుంచి సుదీర్ఘ విరామంపై వెళ్లుతారని పేర్కొన్న పార్టీ వర్గాలు ఎంతకాలం ఆయన బాధ్యతలకుదూరంగా ఉంటారనేది తెలియచేయలేదు. ఈ ఏడాది జనవరిలోనే బాలకృష్ణన్ చికిత్స కోసం మూడు వారాల పాటు అమెరికాలో ఉన్నారు.బాలకృష్ణన్ స్థానంలో పార్టీ కార్యదర్శి బాధ్యతలను తాత్కాలికంగా ఎల్డిఎ కన్వీనర్ , మాజీ ఎంపి ఎ విజయరాఘవన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- Advertisement -