Monday, April 29, 2024

రెండు లక్షల 55 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

997 new covid cases and four deaths in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 55 వేలు దాటింది. మార్చి 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 55 వేల 663 కేసులు తేలినట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. ఇదిలా ఉండగా గురువారం 42,163 టెస్టులు చేయగా 997 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 169 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 18, భద్రాద్రి 65, జగిత్యాల 23, జనగాం 11, భూపాలపల్లి 16, గద్వాల 10, కామారెడ్డి 22, కరీంనగర్ 49 ,ఖమ్మం 44, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 18, మహబూబాబాద్ 20, మంచిర్యాల 19, మెదక్ 16 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 85, ములుగు 21, నాగర్‌కర్నూల్ 25, నల్గొండ 46, నారాయణపేట్ 6, నిర్మల్ 13, నిజామాబాద్ 22, పెద్దపల్లి 21, సిరిసిల్లా 24, రంగారెడ్డి 66, సంగారెడ్డి 24, సిద్ధిపేట్ 18, సూర్యాపేట్ 30, వికారాబాద్ 12, వనపర్తి 10, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ లో 44, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,55,663కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,37,172కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

48 లక్షలు దాటిన కరోనా పరీక్షలు…

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 48 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,12,167 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల్లో 1,29,289 మందికి టెస్టులు చేస్తున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటెన్‌లో వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News