- Advertisement -
తిరువనంతపురం: ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) శివైక్యం చెందారు. కేరళలోని ఎడనీర్ మఠ్లోని ఆదివారం కేశవానంద భారతి తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. 1973లో కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు మెట్లు ఎక్కాడు. సుప్రీంకోర్టు చరిత్రలో 68 రోజుల పాటు విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో కేశవానంద భారతికి అనుకూలంగా తీర్పు వెలువడింది.
- Advertisement -