Friday, April 26, 2024

బండిని మార్చే ప్రసక్తే లేదు : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ నేతలను కలవడం సహజమన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆధారాలున్నందునే మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసిందని చెప్పారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత అరెస్ట్ అంశం తమ చేతుల్లో లేదన్నారు. దర్యాప్తు సంస్థలే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాయన్నారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ను ఎంఐఎం నడిపిస్తుందని ఆయన విమర్శించారు. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణను అవినీతి పరులే వ్యతిరేకిస్తున్నారన్నారు. రూ. 2 వేల నోట్ల రద్దు వెనుక తమ వ్యూహాలు తమకున్నాయన్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదని తేల్చి చెప్పారు.. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. బిఆర్‌ఎస్‌కు బిజెపినే ప్రత్యామ్నాయంగా ఆయన పేర్కొన్నారు బిజెపికి చెందిన రాష్ట్ర నేతలు గత వారంలో ఢిల్లీలో పర్యటించారు. బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారని ప్రచారం సాగింది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుండి మార్చకపోతే రాష్ట్రంలో పార్టీకి మనుగడ లేదని నేతలు ఫిర్యాదు చేశారని ప్రచారం సాగింది. అయితే బండిసంజయ్ ను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ నేతలను కలవడంలో ప్రత్యేకత లేదని తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News