Sunday, April 28, 2024

ఇకపై గాంధీ భవన్ గడప తొక్కనని శపథం చేసిన కొమటిరెడ్డి..

- Advertisement -
- Advertisement -

Komatireddy react on Selected of TPCC Chief

హైదరాబాద్: కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో పార్టీలో అసమ్మతి నెలకొంది. టిపిసిసిని టిడిపిసిసిగా మార్చేశారని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పగ్గాలు ఇవ్వడంపై సినీయర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటులాగా, ఓటుకు పిసిసి పదవిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే వాటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతానన్నారు. ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని కోమటిరెడ్డి శపథం చేశారు. తాను కార్యకర్త నుంచి పైకి వచ్చిన వాణ్ణి అని, ఇకపై తన రాజకీయ భవిష్యత్ ను కార్యకర్తలే నిర్ణయిస్తారన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Komatireddy react on Selected of TPCC Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News