కాపాడాలని మొత్తుకున్నా ముందుకు రాని జనం
అంబులెన్స్ వచ్చే లోపే మృతిచెందిన యువకుడు
మనతెలంగాణ, హైదరాబాద్ : రెండు బస్సుల మధ్య ఇరుక్కు పోవడంతో యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని సికింద్రాబాద్ రైత్ఫైల్ బస్స్టాండ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దుర్గాప్రసాద్ అనే యువకుడు బస్సు కోసం బస్టండ్కు వచ్చాడు. ఈ క్రమంలోనే రెండు బస్సుల మధ్యలో ప్రమాదవశాత్తు ఇరుక్కు పోయాడు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ కాపాడాలని అర్ధగంట పాటు మోత్తుకున్న ఎవరూ కాపాడేందుకు ముందుకు రాలేదు. అక్కడ ఉన్న ఒక్క ప్రయాణికుడు కాపాడేందుకు ముందుకు రాలేదు, ఆర్టిసి సిబ్బంది 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చే సరికే దుర్గా ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.