Wednesday, May 15, 2024

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -
KTR assures all help to family of six-year-old
నిలోఫర్ ఆస్పత్రిలో అత్యాచార బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/నాంపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లం అల్మాస్‌పూర్ గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధకరమని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు బుధవారం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులను మంత్రి వారికి ధైర్యం చెప్పారు. సమా జంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం దారుణమని, బాధకర మన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహా యం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చిన్నారికి అవసరమై న మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కెటిఆర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వెంట రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆ చార్య రమేశ్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మురళీకృష్ణ, తెలం గాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.లాలూప్రసాద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News