Sunday, May 5, 2024

తెలంగాణకు బిజెపి నేతలు ఒక్కపైసా అయినా తెచ్చారా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR comments on BJP in MLC Elections

హైదరాబాద్: బిజెపి నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్కపైసా అయినా తెచ్చారా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక మూలనిధిని ఏర్పాటు చేసి జర్నలిస్టులను ఆదుకున్నామని తెలిపారు. బిజెపి నేతలకు ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నేతలు ఒక్క కారణం చెప్పాలని పిలుపునిచ్చారు. బిజెపి నేతలు కేవలం మతం పేరిట రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఐటిఐఆర్‌ను రద్దు చేసింది బిజెపి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుకా? తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనందుకు బిజెపికి ఓటు వేయాలా? అని చురకలంటించారు. జిడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు చేసింది బిజెపేనని అన్నారు. ఎంఎల్‌సి ఎన్నికలలో వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ఇవ్వనందుకు ఓటెయ్యాలా? బిజెపిని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News