Saturday, April 20, 2024

డిడిడబ్య్లూఎస్ అధికారులకు మంత్రి కెటిఆర్ ప్రశంస

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్య మంత్రిత్వ శాఖ (డిడిడబ్య్లూఎస్) రాజన్న సిరిసిల్ల అధికారులకు మంత్రి కెటిఆర్ ట్విటర్ వేదికగా ప్రశంసలు అందజేశారు. స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 కింద నవంబర్ మాసంలో 4స్టార్‌ కేటగిరిలతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కింది.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబందిత అధికారులకు అభినందనలు అంటూ మంత్రి కెటిఆర్ ట్విట్ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మంత్రి కెటిఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు .మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వళ్లే సాధ్యమైందంటూ ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News