Sunday, April 28, 2024

ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కెటిఆర్ ఆరా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరా తీశారు. మంగళవారం ఈటల భార్య జమున మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భర్తను హత్య చేసేందుకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి కెటిఆర్ స్పందించారు. ఈ విషయంపై డిజిపి అంజనీకుమార్‌తో కెటిఆర్ ఫోన్‌లో మాట్లాడారు.

ఈటల రాజేందర్ భద్రతపై సీనియర్ ఐపిఎస్‌తో విచారణ చేయించాలని మంత్రి సూచించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తరుపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి కెటిఆర్ ఆదేశాలతో డిజిపి, ఈటల భద్రతపై సమీక్షించనున్నారు.

Also Read: ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా ప్రశాంతంగానే ఉన్నారు: ఈటల జమున

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News