Saturday, May 4, 2024

ప్రాణనష్టం జరగొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో ఎంత భారీ వర్షం కురిసినా, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ప్రాణ నష్టం మాత్రం ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో అధికారులంతా పని చేయాలని పురపాలక శాఖ మం త్రి కె.తారక రామారావు ఆదేశించారు. నగరంలో గత రెండు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న ముసురుతో పాటు మరో రెండు మూడు రోజుల పాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ సూచన నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు కల్గకుండా తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై నానక్ రామ్ గూడలోని హెచ్‌జిసిఎల్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు.

రానున్న రెండు మూ డు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం లో జిహెచ్‌ఎంసి ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమై న విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్న ట్లు జిహెచ్‌ఎంసి అధికారులు మంత్రి కెటిఆర్ కు వివరించారు. ఈ మేరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు లాంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు.

జిహెచ్‌ఎంసి చేపట్టిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వల్ల వరద ప్ర భావిత ప్రాంతాల్లో ఈ ఏడాది పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని మంత్రికి వివరించారు. నగర పారిశుద్ధ నిర్వహణకు సంబంధించి మంత్రి కెటిఆర్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్ర స్తుతం మంచి ఫలితాలు ఉన్నాయని, అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కెటిఆర్ అధికారులకు దిశా నిర్దే శం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశం గా గుర్తించి, ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండడం, జనాభా అంతకు అంతా పెరగుతుండడంతో నగరంలో చెత్త సైతం అదే స్థాయిలో ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందు కు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుధ్య ప్రణాళికలను మంత్రి కెటిఆర్‌కి వివరించారు.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News