- Advertisement -
హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల చారిత్రాత్మకమైతే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడంలేదని మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో వ్యవసాయ బిల్లుపై ట్వీట్ చేశారు. ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లును ఆమోదించినప్పుడు రైతులంతా ఊరూరా సంబురాలు చేసుకున్నారని… ఇప్పుడు ఎందుకు చేసుకోవడంలేదని కెటిఆర్ నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.
- Advertisement -