Wednesday, May 15, 2024

మోడీ ప్రభుత్వంతో భూస్వాములకు, కార్పొరేట్లకు లాభం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం పేదల భూములు, అసైన్డ్ భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన భూములను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఖానాపూర్, కోకాపేటలోని భూములను అమ్మేసిందని ఆయన తెలిపారు. ఎకరాకు 100 కోట్లు అమ్మే పరిస్థితి వచ్చిందని, భవిష్యత్‌లో ఫుట్ పాత్ మీద పడుకునే పరిస్థితి వస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం భూస్వాములకు, కార్పొరేట్లకు ఉపయోగపడుతుందని, పేదలను పట్టించుకోవడం లేదన్నారు. సోనియా గాంధీ సభ తరువాత ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని పార్టీలను పిలుస్తానన్నారు. దళిత బంధు ఎవరికీ ఇచ్చారో అడుగుతామని, పేదల భూములు వారికి ఇచ్చే వరకు పోరాడతామని, పేద వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News