Saturday, May 11, 2024

కదం తొక్కిన ధనంజయ

- Advertisement -
- Advertisement -

Lanka scored 279 second innings against West Indies

 

గాలే: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. లంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. దీంతో లంకకు ఇప్పటి వరకు 279 పరుగుల ఆధిక్యం లభించింది. ఒక దశలో 157 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంకను ధనంజయ డిసిల్వా ఆదుకున్నాడు. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ధనంజయ 259 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 153 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ నిసాంకా 66 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఇక ధనంజయ అద్భుత శతకంతో లంక మ్యాచ్‌లో పటిష్టస్థితిలో నిలిచింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చివరి వరకు వికెట్లను కాపాడుకోవడం విండీస్‌కు కష్టమేనని చెప్పాలి. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 10లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News