Tuesday, May 14, 2024

అద్భుతంగా గ్రాఫిక్స్ వర్క్..

- Advertisement -
- Advertisement -

‘రాధేశ్యామ్’ సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. ఆ ఫ్యాన్స్‌కి హ్యాపీ న్యూస్ ఇది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ‘రాధేశ్యామ్’ ప్రచారానికి తెరలేవనుంది. ముందుగా మేకింగ్ వీడియో వచ్చే అవకాశం వుంది. ఆ తరువాత పాటలు వస్తాయట. ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమాలో చివరి 20 నిమిషాల్లో గ్రాఫిక్స్ వర్క్ పీక్స్‌లో ఉంటుందని తెలిసింది. ఈ వర్క్‌ను, సినిమాలో మిగిలిన సిజి వర్క్ ను దాదాపు 60 స్టూడియోలకు కొద్ది కొద్దిగా ఇచ్చారు. అవన్నీ రెడీ అవుతున్నాయి. వింటేజ్ ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో రాసుకున్న లవ్ స్టోరీ ఆధారంగా ‘రాధేశ్యామ్’ రూపొందుతోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Last 20 minutes Graphics in Radhe Shyam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News