Tuesday, April 30, 2024

7 రోజులు.. 56 గంటలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్‌రావు ప్రసంగం అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 56 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ నెల 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలుకాగా, ఈ నెల 6వ తేదీన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది. అలాగే పలు బిల్లు, తీర్మానాలపై చర్చ సాగింది. సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చారు. చివరగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సిఎం కెసిఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.

కెసిఆర్ 30 గంటల 43 నిమిషాల పాటు

మొత్తం 5 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. సభ 7 రోజుల పాటు జరగ్గా మొత్తం 38 క్వశ్చన్‌లను సభ్యులు అడిగారు. మొత్తం 41 మంది సభ్యులకు ఈ సభలో అవకాశం లభించింది. సిఎం కెసిఆర్ 30 గంటల 43 నిమిషాలు మాట్లాడగా, బిఆర్‌ఎస్ సభ్యులు 11 గంటల 05 నిమిషాలు, ఏఐఎంఐఎం పార్టీ సభ్యులు 6 గంటల 04 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు 05 గంటల 46 నిమిషాలు, బిజెపి సభ్యులు 02 గంటల 33 నిమిషాలు, మిగతా సభ్యులు 02 నిమిషాల పాటు మొత్తంగా 56 గంటల 25 నిమిషాల పాటు అసెంబ్లీలో సభ్యులు మాట్లాడారు.

మండలిలో 47 మంది సభ్యులకు అవకాశం

శాసనమండలి 5 రోజుల పాటు 17 గంటల పాటు జరిగింది. ఇక్కడ పలు బిల్లు, తీర్మానాలపై చర్చ సాగింది. ఇందులో 5 బిల్లులపై 15 క్వశ్చన్‌లను మండలి సభ్యులు అడగ్గా, మండలిలో 47 మంది సభ్యులకు మాట్లాడే అవకాశం లభించింది. అందులో భాగంగా 05 బిల్లులను మండలి ఆమోదించింది. మండలిలో సిఎం కెసిఆర్ 07 గంటల 42 నిమిషాలు మాట్లాడగా, బిఆర్‌ఎస్ సభ్యులు 05 గంటల 33 నిమిషాలు, ఏఐఎంఐఎం పార్టీ సభ్యులు 38 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు ఒక గంట 10 నిమిషాలు, పిఆర్‌టియూ 51 నిమిషాలు, మిగతా సభ్యులు ఒక గంట 06 నిమిషాల పాటు మొత్తంగా 17 గంటల పాటు మండలిలో సభ్యులు మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News