Sunday, May 5, 2024

బోర్డు పరీక్షలకు లాక్‌డౌన్ ఫ్రీ..

- Advertisement -
- Advertisement -

 board Exams

న్యూఢిల్లీ: దేశంలో పది, పన్నెండవ తరగతి పరీక్షల నిర్వహణకు లాక్‌డౌన్ సడలింపులు కల్పించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. క్లాసు 10, క్లాసు 12లకు బోర్డు పరీక్షలు ఉన్నందున ఇప్పుడు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు, ఈ విషయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని నిర్ణీత పద్ధతుల మధ్య పరీక్షలు నిర్వహించుకోవచ్చునని, విద్యాసంవత్సర ప్రయోజనాలు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బోర్డు పరీక్షల నిర్వహణ కోసం లాక్‌డౌన్ మినహాయింపులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్‌లు ధరించడం వంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Lockdown free for board Exams says Amit Shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News