Wednesday, May 1, 2024

సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తాం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Lockdown will continue with more relaxation

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. సరి-బేసి విధానంలో మార్కెట్లు, మాల్స్ తెరుచుకుంటాయని కేజ్రీవాల్ తెలిపారు. 50శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ కార్యాలయాలు 50శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించబడతాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు గ్రూప్ ఎ సిబ్బంది 100శాతం, గ్రూప్ బి 50శాతం సిబ్బందితో విధులు నిర్వహించాలని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కోవిడ్-19 థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీ సిఎం తెలిపారు.

Lockdown will continue with more relaxation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News