- Advertisement -
హైదరాబాద్: జూన్ 7న 19 వైద్య పరీక్ష కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రధాన వైద్య కేంద్రాల్లో ఇప్పటికే డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
- Advertisement -