Saturday, April 27, 2024

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైక్ ను మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని ముసారామ్ భాగ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రణీత్ కుమార్ (27) అనే కానిస్టేబుల్ మహాంకాళి పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. టిఎస్ 09 ఎఫ్ పి 5110 అనే యాక్టివ బైక్ పై ప్రణీత్ కుమార్ స్నేహితుడిని కలవడానికి ముసారామ్ బాగ్ వెళ్తున్నాడు. ముసారామ్ భాగ్ సమీపంలో మురళీ మనోహర్ రావు అనే వ్యక్తి బజాబ్ చెతక్ (ఎపి 10ఎం9982) ను రాష్ నడిపిస్తూ యాక్టివను ఢీకొట్టాడు. ప్రణీత్ కుమార్ కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News