Thursday, May 16, 2024

తూకారంగేట్‌లో లాకప్‌డెత్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తూకారం గేట్ పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ వెలుగులోకి వచ్చింది. బైక్ దొంగతనం కేసులో ఎల్‌బినగర్‌కు చెందిన పాత నేరస్థుడు చిరంజీవిని పోలీసులు విచారణకు పిలిపించారు. పోలీసులు ఇంటరాగేషన్‌లో చిరంజీవి అస్వస్థతకు గురికావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. ఈ ఘటనపై తూకారం గేట్ పోలీసులు స్పష్టత ఇవ్వటంలేదు.

Also Read: బాపు రమణలు గొడవపడిన వేళ.. ఏం జరిగిందో తెలుసా ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News