Sunday, April 28, 2024

తూర్పుగోదావరిలో లారీని ఢీకొట్టిన కారు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉంది. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: టెన్నిస్ రారాజు జొకో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News